Monday, 28 January 2019

ఫిబ్రవరి 18 న పార్లమెంట్ ముట్టడికి తరలండి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  28  ఫిబ్రవరి 18 న పార్లమెంట్ ముట్టడికి వేలాదిగా విద్యార్థులు తరలి వెళ్లాలని ఏ  ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి  దుర్గం రవీందర్ పిలుపునిచ్చారు. సోమవారం కరపత్రాలను  విడుదల చేసి మాట్లాడారు. గత నాలుగున్నరేళ్లుగా కేంద్ర ప్రభుత్వం విద్యను కాషాయీకరణ  చేస్తున్నదని  , విద్యారంగంలో ఉన్న పలు సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు. డిమాండ్ల పరిష్కారానికై   ఫిబ్రవరి 18 న పార్లమెంట్ ముట్టడికి మండలంలోని విద్యార్థులు వేలాదిగా తరలి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  జిల్లా ఉపాధ్యక్షులు పూదరి సాయి, కోశాధికారి కస్తూరి రవీందర్, మండల కార్యదర్శి పర్వతి సాయి, మండల అధ్యక్షులు జాడి సాయి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment