కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, జనవరి 07 : రెబ్బెన మండలంలోని ప్రభుత్వ కళాశాలలో మరియు ప్రభుత్వ పాఠశాలలో సోమవారం బెటర్ యూత్ బెటర్ సొసైటీ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సంస్థ అధ్యక్షులు ఓరగంటి రంజిత్ ఓటు హక్కు గురించి విద్యార్థులకు వివరించి జరగబోయేటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని , ఓటర్లు డబ్బుకు మందుకు మరియు ఇతర ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీ పరులకు ఓటు వేసి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. కేవలం ఎలక్షన్లు వచ్చినప్పుడే వచ్చే నాయకుల కన్నా నిజాయితీగా ఉండే నాయకులను ఎన్నుకోవాలని వారు అన్నారు.. ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి మరిన్ని కార్యక్రమాలతో ముందుకు వస్తున్నట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శంకర్ , పాఠశాల ప్రదనోపాధ్యాయురాలు స్వర్ణలత , సంస్థ ప్రధాన కార్యదర్శి గజ్జల సత్యనారాయణ ఉపాధ్యక్షులు నామాల రాజశేఖర్, రవీందర్ , కార్యదర్శులు పెంట పర్తి తిరుపతి , వేల్పుల తిరుపతి, సభ్యులు రాజశేఖర్ సాయి, కళాశాల ఉపాధ్యాయులు సతీష్, ప్రకాష్, అమరేందర్, మంజుల, మల్లేశ్వరి, సంధ్య, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు మోగిలి, ప్రభాకర్, సుదేవి చారందస్, శ్రీదేవి, పుష్పలత ,చంద్రశేకర్ ,బానేశ్, తుకరం, అనీష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment