కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, జనవరి 13 : యువతి యువకులందరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని రెబ్బెన మండల తహసీల్దార్ ఇంతియాజ్ అహ్మద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 2019 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారందరు తప్పని సరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని అన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో ఓటరుగా నమోదు చేసుకోవడానికి కావలసిన అన్ని ఫారాలు అందుబాటులో ఉంచామన్నారు. నిర్దేశిత ఫారాలను ఈ నెల 25 లోపు బూత్ లెవల్ అధికారులకు లేదా తహసీల్దార్ కార్యాలయంలో అందజేయాలన్నారు.ఓటరు జాబితాలో వివరాల మార్పులుచేర్పులకు కూడా అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు.
No comments:
Post a Comment