కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, జనవరి 24 : రెబ్బెన మండలంలో ని సుప్రసిద్ధ గంగాపూర్ బాలాజీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల ఇరవై ఏడో తేదీన ఉదయం పన్నెండు గంటలకు జాతర వేలం పాటనిర్వహించనున్నట్లు ఆలయ ఈవో బాపిరెడ్డి గురువారం తెలిపారు వచ్చే నెల18 వ తేదీ నుండి మూడు రోజుల పాటు నిర్వహించే జాతర సందర్భంగా ఆలయంలో కొబ్బరికాయలు, ప్రసాద తయారీ మరియు విక్రయం, జాతరలో భాగంగా తై బజార్, సైకిల్ స్టాండ్ ల నిర్వహణ వేలం పాట ఉంటాయని తెలిపారు. వేలంలో పాల్గొనే వారు ఇరవై వేలు ధరావతు చెల్లించి బహిరంగ వేలం పాటలో పాల్గొనవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని ఆసక్తి గల వారు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు
No comments:
Post a Comment