కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, జనవరి 07 : బెల్లంపెళ్లి ఏరియా లోని కైరుగుడా, డోర్లిలలో సమ్మెను విజయవంతం చెయాలని ఏఐటీయూసీ,ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో సోమవారం ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్,జిల్లా ,ఐ ఎఫ్ టి యు కమిటీ సబ్యులు తిరుపతి, కార్మికులను కలిసి సమ్మెలో పాల్గొనాలని ప్రచారం చేశారు. దొర్లిలో కార్మికులతో కలిసి సమ్మె వాల్ పోస్టర్లు విడుదల చేయడం జరిగింది. అనంతరం కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ వర్క్ షాప్,స్టోర్ ఏరియా లోని కార్మికులను కలిసి సమ్మెలో పాల్గొనాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా బోగే ఉపేందర్ మాట్లాడుతూ కార్మికుల హక్కుల సాధనకై సమ్మె చేయక తప్పడం లేదని, కావున కార్మికులందరూ అధిక సంఖ్యలో సమ్మె లో పాల్గొని కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర , రాష్ట్ర మరియు సింగరేణి సంస్థ యజమాన్యానికికి తగిన బుద్ది చెప్పాలని కిరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ సభ్యులు సాగర్ గౌడ్ ,నాయకులు తిరుపతి,సదయ్య,రాజన్న, ఆశలు,గణపతి, వెంకటేష్,సతీష్,తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment