Thursday, 31 January 2019

రిటైరయిన కార్మికుడికి ఘన సన్మానం

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  31  సింగరేణి సంస్థలో వివిధ హోదాలలో  30 సంవత్సరాలు 7 నెలల పాటు సుధీర్ఘ కాలం సేవలందించిన శ్రీ  కందుల కేశవ రెడ్డి, పంప్ ఆపరేటర్     పదవి విరమణ సందర్భంగా డోర్లి ఒసిపి.1లో ఘనంగా  సన్మానించారు.  ఈ కార్యక్రమం లో  ప్రాజెక్ట్ అధికారి శ్రీ పురుశోత్తం రెడ్డి  మాట్లాడతూ  " కందుల కేశవ రెడ్డి  శేష జీవితం ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకున్నారు.  మరియు టర్మినల్ బెన్ఫిట్స్ ద్వారా వచ్చిన డబ్బులను పొదుపు చేసుకొని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. . ఈ కార్యక్రమం లో గని మెనేజర్ శ్రీ ఉమాకాంత్, సేఫ్టీ  అధికారి నారాయణ , పిట్ ఇంజనీర్ జ్ణానేశ్వర్ , ఇంజనీర్లు వసంత్ కుమార్, తేజ, సంక్షేమాధికారి  వేణు, డి వై మేనేజర్లు సుమన్, సునీల్, అండర్ మేనేజర్లు మహేంధర్ రెడ్డి, ప్రశాంత్ జీవన్, సర్వే ఆపీసర్ రామ్మోహన్, జి. ఎం. స్ట్రక్చర్ కమిటీ సభ్యుడు ఎం. సమ్మయ్య ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గోన్నారు.

No comments:

Post a Comment