Friday, 18 January 2019

ఓటు హక్కు నమోదు చేసుకోవాలి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  18 :  రాబోయే కాలంలో దేశవ్యాప్త ఎలెక్షన్లు ఉన్నందున   యువతి యువకులందరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని రెబ్బెన మండల తహసీల్దార్ ఇంతియాజ్ అహ్మద్ శుక్రవారం  ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 2019  నాటికి 18 సంవత్సరాలు నిండిన వారందరు తప్పని సరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని అన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో ఓటరుగా నమోదు చేసుకోవడానికి కావలసిన అన్ని ఫారాలు అందుబాటులో ఉంచామన్నారు. నిర్దేశిత ఫారాలను ఈ నెల 25 లోపు బూత్ లెవల్ అధికారులకు లేదా   తహసీల్దార్ కార్యాలయంలో అందజేయాలన్నారు.ఓటరు జాబితాలో వివరాల  మార్పులు చేర్పులకు  కూడా అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు

No comments:

Post a Comment