కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, జనవరి 08 : చట్ట బద్దమైన కార్మికులసమస్యలను పరిష్కరించాలని బెల్లంపల్లి ఏరియా సింగరేణి జీఎం కే రవిశంకర్ కు ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నాయకులూ మహమ్మద్ చాంద్ పాషా ఆధ్వర్యంలో మంగళ వారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది సంఘటిత, అసంఘటిత కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సమాన పనికి సమాన వేతనం అందించాలని, నెలకు కనీసం 18000/- జీతం అసంఘటిత కార్మిక వర్గానికి అందించాలని, నిత్యవసర సరుకుల ధరలను నియంత్రించి అందుబాటులో ఉంచుతూ పేదల అవసరాలను తీర్చాలని అనేక సమస్యల పై సమ్మెచేపట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో చల్లూరి అశోక్, ఏ బాపు, మైసూర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment