Tuesday, 8 January 2019

చట్ట బద్దమైన కార్మికులసమస్యలను పరిష్కరించాలి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  08 : చట్ట బద్దమైన కార్మికులసమస్యలను పరిష్కరించాలని బెల్లంపల్లి ఏరియా సింగరేణి జీఎం  కే రవిశంకర్ కు ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నాయకులూ  మహమ్మద్ చాంద్ పాషా  ఆధ్వర్యంలో మంగళ వారం  వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా   వారు మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను  వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న  కోట్లాది  మంది సంఘటిత, అసంఘటిత కార్మికులు  తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సమాన పనికి సమాన వేతనం  అందించాలని, నెలకు కనీసం 18000/- జీతం అసంఘటిత కార్మిక వర్గానికి అందించాలని, నిత్యవసర సరుకుల ధరలను నియంత్రించి అందుబాటులో  ఉంచుతూ పేదల అవసరాలను తీర్చాలని అనేక సమస్యల పై సమ్మెచేపట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో చల్లూరి అశోక్, ఏ  బాపు, మైసూర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment