కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, జనవరి 28 ; గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఉత్తమ సేవా అవార్డు అందుకున్న రెబ్బెన ఎస్సై దీకొండ రమేష్ ను సోమవారం రెబ్బెన మండల పి ఆర్ టి యు శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కల్వల శంకర్, జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల సదానందం , మండల ప్రధాన కార్యదర్శి అనిల్కుమార్లు శాలువా కప్పి మెమెంటో తో సన్మానించారు. ఈ సందర్భంగా పి అర్ టి యు డైరీ క్యాలెండర్లను అందచేశారు. వారు మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతలను కాపాడుతూ పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా రెబ్బెన మండలంలో పలు సేవా కార్యక్రమమాలు నిర్వహించారన్నారు. వర్షాలతో గుంతలమయంగా రోడ్లను మరమ్మత్తు చేశారని, ముఖ్యంగా యువతను చేదు దారిలోనుంచి మంచి వైపు మరల్చడానికి ఎస్సై ఎంతో కృషిచేశారన్నారు. విద్యారుల పట్ల ప్రేత్యేకమైన శ్రద్ధ కనపర్చారన్నారు. ఈ విషయాలను పై అధికారులు గమనించి ఉత్తమ సేవా అవార్డు ఇట్చి ప్రోత్సహహించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎస్సై దీకొండ రమేష్ మాట్లాడుతూ మండలంలో 10 వ తరగతి పరీక్షలు వ్రాయబోతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందచేయడానికి కృషిచేస్తున్నామని,వాటిని సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలను రాబట్టాలనిఉపాధ్యాయులను కోరారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కురిపెంగా శ్రీనివాస్, ధర్ము తదితరులు పాల్గొన్నారు. .
No comments:
Post a Comment