కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, జనవరి 15 : సంక్రాంతి పండుగ సందర్బంగా సంజీవని స్వచ్చంద సేవ సంస్థ ఆద్వ ర్యములో మంగళవారం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి రోజు న మహిళలు ఇండ్ల ముందు స్వయంగా వేసిన ముగ్గులను సంస్థ సభ్యులు ద్విచక్ర వాహనాలపై ఇల్లు ఇల్లు తిరుగుతూ ఫొటోలు తీశారు . న్యాయ నిర్ణేతలు గా మాన్యం పద్మ. వై సుజాత, దీకొండ విజయ కుమారి లు వ్యవహరించారు. వారు ఎంపిక చేసిన ముగ్గులకు ప్రథమ , ద్వితీయ , త్రితీయ , కన్సోలేషన్ బహుమతులను గెలిచిన మహిళలకు చీఫ్ గెస్ట్ గా వచ్చిన రెబ్బెన ఎస్ ఐ దీకొండ రమేష్ బహుమతులను అందజేశారు. ఎస్ ఐ రమేష్ మాట్లాడుతూ సంజీవని స్వచ్చంద సేవ సంస్థ పండగా సందర్బంగా మహిళలను ప్రోష్టహించి ముగ్గుల పోటీలు పెట్టడం ఎంతో అభినందనీయమని అన్నారు. సమాజములో సేవ కార్య క్రమాలు మరిన్ని చేయాలని మా ప్రోత్సహం ఎల్లప్పుడూ ఉంటుంది అని అన్నారు. సంస్థ అధ్యక్షుడు , వ్యవస్థాపకులు దీకొండ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ సమాజములో సేవ చేయాలనే ఆలోచనతో , లక్ష్యం తో సేవ సంస్థను స్థాపించామని. సంస్థ ఆధ్వర్యములో రెబ్బెన డిగ్రీ కాలేజ్ తహసీల్దార్ తో విద్యార్థులకు ఓటు హక్కు పై అవగాహన కల్పించామని, రెబ్బెన ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులకు పండ్ల పంపిణీ, హరితహారం లో భాగంగా చెట్లు నాటడం జరిగిందని అన్నారు. అంగన్వాడీ కేంద్రములో చెట్లు నాటాము. శ్రీరామ నవమి రోజు న సీతారాముల కళ్యాణములో సంస్థ వాలంటరీ గా పని చేశామని తెలిపారు . త్వరలో మెడికల్ క్యాంపు నిర్వహిస్తామని, సేవ కార్యక్రమాలు చేయాలనే దృఢ నిశ్చయముతో ఉన్నామని, అందరి సహాయ సహకారాలు కావాలని అన్నారు. సంస్థ సహాయ కార్యదర్శి పర్వతి సాయి కుమార్, ట్రెజరర్ డి సాయితేజ , న్యాయ నిర్ణేత మాన్యం పద్మ , సభ్యులు విజయ కుమారి, సుజాత తో పాటు మహిళలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment