కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, జనవరి 13 : వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రత అందరి భాద్యత అని ప్రోగ్రామ్ ఆఫీసర్ డిదేవాజి అన్నారు. ఆదివారం రెబ్బెన మండలంలోని సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాల విద్యార్థుల ఎన్ ఎస్ ఎస్ శిబిరం రెండవ రోజు కొనసాగింది. ఆదివారం ఇందిరానగర్ గ్రామంలో నాలాలలో పేరుకు పోయిన చెత్తా చెదారాన్ని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ప్రోగ్రామ్ ఆఫీసర్ డిదేవాజి మాట్లాడుతూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే సీజనల్ వ్యాధులు ప్రబల కుండా ఉంటాయని అన్నారు. గ్రామస్తులకు స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పూదరి మల్లేష్, గణేష్ , త్రివేణి,ఉప్పులేటి మల్లేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment