కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, జనవరి 17 : రెబ్బెన మండలంలోని తక్కెళ్లపల్లి గ్రామపంచాయతీ ఎన్నికలలో గ్రామపంచాయతీ సర్పంచ్ ను ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని ఎన్నికల సహాయ అధికారి సత్యనారాయణ సింగ్ గురువారం తెలిపారు. సర్పంచ్ బరిలో మాడే శంకర్, టేకం రామయ్య, ఎం లక్ష్మి లు బరిలో ఉండగా గ్రామస్తులు సర్పంచ్ గా మడేశంకర్ ను, ఉపసర్పంచిగా ఇందూరి మహేందర్ ను ఎన్నుకున్నారు. వార్డు మెంబర్లుగా ఉప్పల సునీత ,ఉప్పల శంకర్ సుమలత, మహేందర్, సందీప్, వనిత కిష్టయ్య, గంగుల సుమిత్ర లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
No comments:
Post a Comment