కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, జనవరి 18 : స్వర్గీయ యన్ టీ ఆర్ 23 వ వర్దంతి పురస్కరించుకొని శుక్రవారం రెబ్బెన మండల కేంద్రంలో మండల తే.దె.పా ఆధ్వర్యంలో ఎన్ టి ఆర్ విగ్రహానికి జిల్లా మహిళా అధ్యక్షురాలు సొల్లులక్ష్మి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలుగు దేశం పాలన హయాంలో తెలంగాణా ప్రాంతం ఎంతో అభివృద్ధి జరిగిందని అన్నారు. బిసి, ఎస్సి, ఎస్టీ మైనారిటీ ల హక్కుల సాధనలో ఎన్ టి ఆర్ వారి కష్ట సుఖాలలో పాలు పంచుకుని ఎంతో కృషి చేశారన్నారు. తెలుగు దేశం పేదల పార్టీ అని రాబోయే రోజుల్లో టిడిపి జెండా ఎగరడం ఖాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమములో మండల అధ్యక్షుడు విజయ్, మండల యూత్ అధ్యక్షులు కే శ్రీనివాస్, సంతోష్, బిక్షపతి తదితరురులు ఉన్నారు .
No comments:
Post a Comment