Friday, 18 January 2019

యన్ టీ ఆర్ 23వ వర్దంతి పురస్కరించుకొని పూలాభిషేకం


 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  18  స్వర్గీయ యన్ టీ ఆర్ 23 వ వర్దంతి పురస్కరించుకొని శుక్రవారం    రెబ్బెన  మండల  కేంద్రంలో మండల తే.దె.పా ఆధ్వర్యంలో ఎన్ టి ఆర్ విగ్రహానికి  జిల్లా మహిళా అధ్యక్షురాలు సొల్లులక్ష్మి   పూలమాలలు వేసి  నివాళు లర్పించారు.  ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలుగు దేశం పాలన  హయాంలో తెలంగాణా ప్రాంతం ఎంతో అభివృద్ధి జరిగిందని అన్నారు. బిసి, ఎస్సి,  ఎస్టీ మైనారిటీ ల హక్కుల సాధనలో ఎన్  టి ఆర్ వారి కష్ట సుఖాలలో పాలు పంచుకుని  ఎంతో కృషి చేశారన్నారు. తెలుగు దేశం పేదల పార్టీ అని  రాబోయే రోజుల్లో టిడిపి  జెండా ఎగరడం ఖాయమని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమములో మండల అధ్యక్షుడు విజయ్, మండల యూత్ అధ్యక్షులు కే శ్రీనివాస్, సంతోష్, బిక్షపతి    తదితరురులు ఉన్నారు .

No comments:

Post a Comment