Thursday, 17 January 2019

ఎన్ ఎస్ ఎస్ ప్రేత్యేక శిబిరం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  17 : రెబ్బెన మండలం ఇందిరా నగర్ లో  రెబ్బన  డిగ్రీ కళాశాల ఎన్  ఎస్ ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిబిరం గురువారం అరవ రోజు కొనసాగింది.  ఈ సందర్భంగా విద్యార్థులు ఇందిరా నగర్  నుండి గొల్లగూడ  దారిలో రోడ్డుపై ఉన్న గుంతలలో మట్టి వేసి ఒక కిలోమీటరు వరకు చదును చేయడం జరిగింది.  ఈ దారిలో వెళ్లే  గ్రామస్తులు విద్యార్థుల సామాజిక సేవను  చూసి విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమంలో  ప్రిన్సిపాల్ జాకీర్ ఉస్మాని, ఎన్ఎస్ఎస్ ఇంచార్జీ దుర్గం దేవాజి ,  అధ్యాపకులు ఉప్పులేటి మల్లేష్,  పూదరి మల్లేష్,  గణేష్,  శ్రీకాంత్,  స్వప్న విద్యార్థులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment