కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, జనవరి 17 : రెబ్బెన మండలం ఇందిరా నగర్ లో రెబ్బన డిగ్రీ కళాశాల ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిబిరం గురువారం అరవ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా విద్యార్థులు ఇందిరా నగర్ నుండి గొల్లగూడ దారిలో రోడ్డుపై ఉన్న గుంతలలో మట్టి వేసి ఒక కిలోమీటరు వరకు చదును చేయడం జరిగింది. ఈ దారిలో వెళ్లే గ్రామస్తులు విద్యార్థుల సామాజిక సేవను చూసి విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జాకీర్ ఉస్మాని, ఎన్ఎస్ఎస్ ఇంచార్జీ దుర్గం దేవాజి , అధ్యాపకులు ఉప్పులేటి మల్లేష్, పూదరి మల్లేష్, గణేష్, శ్రీకాంత్, స్వప్న విద్యార్థులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment