కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, జనవరి 18 : రెబ్బెన మండలంలోని సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాల విద్యార్థుల ఎన్ ఎస్ ఎస్ శిబిరం ముగింపు రోజు ఇందిరానగర్ పంచాయాతి లోని నక్కాలగూడా గ్రామంలో కొనసాగింది. ఈ సందర్భంగా అక్షరాస్యత పై అవగాహనా ర్యాలీ నిర్వహించారు. అనంతరం నక్కాలగూడా నుండి పొలాలకు వెళ్లే దారికిరువైపులా పేరుకుపోయిన , పొదలను శుభ్రం చేశారు. నక్కలగు డా పాఠశాల విద్యార్థులకు క్విజ్ పోటీ నిర్వహించి ప్రధమ , ద్వితీయ, తృతీయ బహుమతులను అందచేశారు. ఈ కార్యక్రమంలో ప్రొగ్రమ్మె ఆఫీసర్ డి దేవాజి, కాలేజీ ప్రిన్సిపాల్ జాకిర్ ఉస్మాని, కాగజ్ నగర్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీధర్ సుమన్, నక్కలగూడ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్వల శంకర్, , అధ్యాపకులు పూదరి మల్లేష్, గణేష్ , స్వప్న,త్రివేణి ,ఉప్పులేటి మల్లేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment