కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, జనవరి 10 : రెబ్బెన మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం టియుటిఎఫ్ కాలెండర్లను ప్రధాన ఉపాధ్యాయురాలు స్వర్ణలత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టియుటిఎఫ్ మండల అధ్యక్షుడు సిహెచ్ మొగిలి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు తమ వంతు విధులను నిర్వహించినప్పుడే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయన్నారు ఈ కార్యక్రమంలో టియుటిఎఫ్ రెబ్బెన జనరల్ సెక్రటరీ కామ్రేడ్ జమున దాస్ , జిల్లా సంయుక్త కార్యదర్శి అనీష్ అహ్మద్ , జిల్లా కార్యవర్గ సభ్యులు బి చంద్రశేఖర్, మండల మహిళా అసోసియేషన్ సభ్యురాలు శ్రీమతి షబానా బేగం,మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment