Friday, 8 January 2016

కొలవార్ భీమ దేవర జండా పండుగను ఘనంగా జరుపుకోవాలి

కొలవార్ భీమ దేవర జండా పండుగను ఘనంగా  జరుపుకోవాలి 

కొలవార్ భీమ దేవర జండా పండుగను గిరిజన గ్రామాలలో జరుపుకోవాలని ఆదివాసీ కొలవార్ సంఘం మండల అద్యక్షుడు మైలారం శ్రీనివాస్ అన్నరు. రెబ్బెన మండలంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన  మాట్లాడుతూ  ఈ నెల 8వ తేది నుండి 15వ తేది వరకు "భీమ దేవర జండా పండుగ" 14వ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నామని అన్నారు. ఈ పండుగను ఆయా కొలవార్ గిరిజన గ్రామాలు మరియు గిరిజన గుడాలలో జరుపుకొని తమ జాతి ఔన్నత్యాన్ని చాటుకోవాలని, తమ పురాతన సంప్రదాయాలను మరవరాదని ఈ సందర్భం గ అయన కోరారు.  ఈ సమవేశం లో మండల ఉపాధ్యక్షుడు కోడిపె వెంకటేష్, మండల కార్యదర్శి  బుర్స . పొచమల్లు,తుడుం దెబ్బ మండల అద్యక్షుడు ఎర్గటి సుధాకర్, తుడుందెబ్బ  మండల కార్యవర్గ  సభ్యుడు  ఎర్గటి గోపాల్  తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి


సింగరేణి

గోలేటి 1-ఏ ను పూర్తి స్థాయిలో నడిపించాలి  
బెల్లెంపల్లి ఏరియ లో ఉన్న ఏకైక బొగ్గు గనిని పూర్తి స్తాయులో నడిచేవిదంగా చూడాలని ఎ,అయ్,టీ,యు,సి ఆధ్వర్యంలో బుధవారం వినతి పత్రాన్ని ఇచ్చారు. ఎ,అయ్,టీ,యు,సి బ్రాంచ్ కార్యదర్శి ఎస్, తిరుపతి మాట్లాడుతూ ఓసి ల పేరుతో సింగరేణి యాజమాన్యం వందల ఎకరాలు భూసేకరణ చేస్తున్నారని, గోలేటి 1-ఏ కోసం భూసేకరణ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. కొన్ని సామ్, లుగా భూగర్భ గనిని కాపాడుకుంటూ కార్మికులు కాపాడుకుంటున్నారని అన్నారు. కామికుల బదిలీలు చేయకుండా గనిని నడిచే విధంగా చూడాలని అన్నారు.

No comments:

Post a Comment