Friday, 22 January 2016

స్వచ్చ పాటశాలకు పురష్కారం అందచేత

స్వచ్చ  పాటశాలకు పురష్కారం అందచేత 
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) ;;రెబ్బెన మండలంలోని పులికుంట మండల ప్రాథమిక పాటశాలలో  విద్యార్థులకు ఆట వస్తువులు మరియు వస్తుసామాగ్రి రెబ్బెన  ఉప తహసిల్దార్ అందజేశారు. ఈ పాటశాల మండలంలొని స్వచ్చ పాటశాలగా అంపిక  అయిన సందర్బంగా రెబ్బెన ఎం పి పి కర్నాథం సంజీవ్  కుమార్ మరియు  జెడ్ పి  టి సి అజ్మీర బాపురావు రెబ్బన తహసిల్దార్ రమేష్ గౌడ్, ఎం ఇ ఒ వెంకటేశ్వరస్వామి  ఈ  పురాష్కరంను పులికుంట మండల ప్రాథమిక పాటశాల ప్రధానోపాధ్యాయుడు తొడబింది  శ్రీనివాస్ కు  అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  నేటి బాలలే రేపటి పౌరులు అని, విద్యార్థులు అన్ని రంగాలలో ముందుకు రావాలని అన్నారు. ప్రభుత్వ పాటశాలను ఈ రకముగా అభివృద్ధి చేసినా ప్రధానోపాధ్యాయుడును అభినందిచారు. ఇంకా పాటశాలను అభివృద్ధి వైపు నడిపించాలని మండలంలోని పులికుంట పాటశాలను ఆదర్శంగా తీసుకోని సాధనకు తోడ్పుడాలని వారు అన్నారు  ఈ కార్యక్రమంలో పాటశాల  ప్రధానోపాధ్యాయుడు టి.శ్రీనివాస్, ఉపాద్యాయుడు శ్రీనివాస్ గౌడ్ సర్పంచ్ శ్రీమతి  గజ్జెల సుశీల  పాటశాల చైర్మన్ పొశమల్లు , టిఆరెస్ నాయకులు  కుందారపు శంకరమ్మ , చెన్న సోమశేఖర్,   రవి, పాటశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్ల్గొన్నారు.

No comments:

Post a Comment