పి ఆర్ టి యూ సబ్యత్వ నమోదు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 15 ; రెబ్బెన మండలం లో పి ఆర్ టి యూ సభ్యత్వం నమోదు చేస్తున్నట్లు మండల అధ్యక్షుడు ఎస్ కే ఖాదర్ తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి పాఠశాలలో సందర్శించి ఉపాధ్యాయుల సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడం లో పి ఆర్ టి యూ ముందుంటుందని పేర్కొన్నారు. అదే విదంగా మండలంలోని ఉపాధ్యాయుల సభ్యత్వ నమోదు జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి డి రవీందర్,జిల్లా ఉపాధ్యక్షులు బి సదానందం, అశోక్, కవిత, తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment