కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 26 ; (వుదయం ప్రతినిధి) ; రెబ్బెన మండలం నంబాలలోని శ్రీ ప్రసన్న పరమేశ్వరాలయం ఆలయ వార్షికోత్సవం సందర్బంగా ఈ నెల 29వ తేదీనాడు ఉదయం 09-10 గంటలకు ఆలయ వార్షికోత్సవ ఉత్సవం నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ అధ్యక్షులు పూదరి వెంకటేష్ తెలిపారు.కావున ఈ సందర్బంగా ఆలయంలో ఏకాదశ,రూద్రాభిషేకం,మృత్యుంజయ హోమం,రుద్రహోమం పశుపతి హోమం,అను విశేష హోమ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేసారు.28వ తేదీనాడు శుక్రవారం రోజున ఏక్కహం ప్రారంభం అయ్యి 29వ తేదీ శనివారం వరకు కొనసాగుతుందని అన్నారు.హోమంలో పాల్గొనదలచిన భక్తులు ఈ క్రింది చరవాణి నంబర్ లను 9866003618, 9908748681, 9704112395 సంప్రదించాలని కోరారు.
No comments:
Post a Comment