కేటీఆర్ జన్మదిన సందర్భంగా మొక్కలు నాటిన సేవా సంస్ధ
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); కేటీఆర్ జన్మదిన సందర్భంగా స్నేహ కల్చరల్ ఆర్ట్స్ &సేవా సంస్ధ వారు రెబ్బెన మండలం లోని గోలేటి గ్రామపంచాయితీ లో ఆదివారము రోజున ఐ టి డిఎ ప్రాధమిక పాఠశాల అవరణలో మొక్కలు నాటారు. అనంతరం పాఠశాల విద్యార్థులు మిఠయిలు పంచుకోని వేడుకలు జరుకున్నారు. ఈ సందర్భంగా అసిపాబాద్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్, స్నేహ కల్చరల్ సంస్ధ ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ మాట్లాడుతు ఈ రోజున కేటీఆర్ జన్మదిన సందర్భంగా మొక్కలు నాటామ్మన్నారు విద్యార్థలకు చిన్నతము నుంచే పర్యావరణాన్ని కాపాడేవిధంగా మొక్కలు నాటే అలవాటు చేసుకోవాలని అవగాహన కలిపించారు. అనంతరం విద్యార్థులు పచ్చదనం ప్రగతికి మెట్లు అని నినాదాలు చేస్తూ ప్రధాన వీధులగుండా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బి గోపాలకృష్ణ , బానోత్ దేవయ్య , బోయిని శంకరమ్మ , యల్ ప్రభాకర్ , రమేష్ , నాగయ్య , స్వామి తదితరాలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment