Sunday, 24 July 2016

సింగరేణి హరితహారం -తెలంగాణ హరితహారం


                  సింగరేణి హరితహారం -తెలంగాణ హరితహారం 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి);   ప్రతి ఒక్కరుమొక్కలు నాటి కాపాడాల్సిన సామాజిక భాద్యత అందరిపై ఉందని  బెల్లంపల్లి జెనరల్ మేనేజర్ కె రవి శంకర్ అన్నారు . సోమవారం  సింగరేణి హరితహారం -తెలంగాణ హరితహారం   లోభాగంగా  ఖైరి గూడా ఓ సి పి లో మొక్కలను నాటారు . ముందుగా గోలేటి లోని జెనరల్ మేనేజర్ కార్యాలయము నుండి మహా ర్యాలీ నిర్వ హించారు . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్త్వకంగా తీసుకొని చేపడుతున్నా హారితహారం లో  సింగరేణి ఆధ్వర్యములో బెల్లంపల్లి ఏరియా లో  మొక్కలను  నాటామని అన్నారు  ప్రతి ఒక్కరు ఇంటికి 5 మొక్కలు నాటితే ఆ గ్రామమే ఉద్యాన వనంగా మారుతుందని ఆయన అన్నారు .    సామాజిక భాద్యతగా ప్రతి ఒక్కరు మొక్కలు  నాటి కాపాడాల్సిన భాద్యతగ అందరిపై ఉందని తెలిపారు .  . రాబోయే కాలములో అడవిలో తెలంగాణ ను ముఖ్య మంత్రి కె     సి ఆర్ చూడాలి అని , ఈ నాటి మొక్కలే భావి తరాలకు జీవనాధారమని దానికోసం మొక్కలను పెంచాలని పేర్కొన్నారు . ఈ కార్య క్రమములో ఎస్ ఓ టు జి  కొండయ్య , డి జి ఎం చిత్తరంజన్ , సేవ సమితి అధ్యక్షురాలు అనురాధ , టి బి జి కె ఎస్ సెంట్రల్ కార్యదర్శి ఎంశ్రీనివాసరావు , మార్కెటింగ్ వైస్ చైర్మల్ కుందారపు  శంకరమ్మ , ఏ ఐ టి సి బ్రానుంచి కార్య దర్శి ఎస్ తిరుపతి , పర్య వరణ అధికారి కృష్ణా చారీ , ఏ జి ఎం రామ రావు , ఐ ఈ డి యోహాన్ , తది తరులు  ఉన్నారు.

No comments:

Post a Comment