ఉపాధ్యాయ మండల స్థాయి కార్యవర్గం ఎన్నిక
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బన మండలోని ఉపాధ్యాయ ఉద్యోగ కార్యావర్గ ఎన్నికలు శనివారం జరిగాయి. సి పి ఎస్ ఉపాధ్యాయ తెలంగాణ రాష్ట్ర సహాధ్యక్షులు యం శ్రీనివాస్, ఆదిలాబాద్ తూర్పుజిల్లా ప్రధాన కార్యదర్శి జి మహిపాల్ మరియు ఆర్ సత్యం ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గంలో అధ్యక్షులుగా యస్ అనిల్ కుమార్, ఉపాధ్యక్షులుగా టి రాంమోహన్ రావు , ఆర్గనైజింగ్ సేకరేటరీ జి విజయ్ రావు , ప్రధాన కార్యదర్శి జె జ్ఞానేశ్వర్, మహిళ అధ్యక్షురాలు యస్ లావణ్య , సంయుక్త కార్యదర్శి యస్ సత్యనారాయణ మూర్తి, కార్యదర్సులుగా జాఖీర్ , అరుణాదేవి, మధుకర్, రోజారమని లను ఉపాధ్యాయుల సమక్షంలో ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు సిపిఎస్ కు వ్యతిరేకంగా మండలస్థాయి కార్యక్రమాలు కొనసాగిస్తోంది అందుచే మండల కార్యవర్గ ఎన్నికలు జరుపడం జరిగిందన్నారు. ఉపాధ్యాయ సమఃస్యలపై అనునిత్యం పోరాడుతామని అన్నారు.
No comments:
Post a Comment