రోళ్ళపాడులో జన మైత్రి గ్రామ సభ
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండల కేంద్రం లోని రోళ్ళపాడు గ్రామలో జన మైత్రి సభ లో బుధవారం రెబ్బెన ప్రొఫెషనల్ ఏ సై శ్రీకాంత్ మరియు గ్రామ అధికారి హెడ్ కాన్స్టేబుల్ రాజయ్య లు ప్రజలకు అవగాహన కల్పించారు. పోలిసులు ప్రజల కోసం స్నేహపూర్వకంగా ఉంటారని, ఏ సమస్యలు వచ్చిన సమస్యలు పరిష్కరించడానికి నిత్యం పోలీసుల మీ చెంత ఉంటారని అన్నారు ప్రజలు భయాన్ని విడి సమాచారం అయినా అందించాలని, గ్రామ అభివృద్ధి ప్రజల సమస్యలను ఏ సమయములో నైనా శాంతి భద్రతలను కాపాడతామన్నారు ప్రజలకు చట్టాల గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో గ్రామా సర్పంచ్ పెసారు వెంకటమ్మ ,మేడి చిన్నయ్య,టీడీపీ మండల అధ్యక్షుడు సంగం శ్రీనివాస్ ,పోలీస్ , గ్రామా ప్రజలు తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment