Saturday, 27 January 2018

 తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం జెండా ఆవిష్కరణ   

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 27 ;   తెలంగాణ బొగ్గు గని  కార్మిక సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని  శనివారం బెల్లంపల్లి ఏరియా గోలేటిలోని తెలంగాణ భవన్ లో  జండాను ఎగురవేసి సంఘం ఏరియా ఉపాధ్యక్షులు సదాశివ్  మాట్లాడుతూ టి బి జి కే ఎస్ ఆవిర్భవించి నేటికీ పదిహేనేళ్ళైందని, ఈ సంఘం  కార్మికుల  సంక్షేమం కోసమేనని ,ఈ సంఘం ఆహర్నిశలు కార్మికుల సంక్షేమంకోసం పాటుపడుతున్నదని, ఈ విషయాన్నీ గమనించి  మొన్న జరిగిన సింగరేణి  ఎన్నికలలో కార్మికులు ప్రధాన గుర్తింపు సంఘంగా ఎన్నుకొన్నారన్నారు. ఈ సందర్భంగా అన్నిబావులవద్ద,  ఓపెన్ కాస్ట్ ల వద్ద  సంఘం జండాలను ఎగురవేసి కార్మికులు తమ ఆనందాన్ని వ్యక్త పరిచారన్నారు.  ఈ కార్యక్రమంలో నాయకులు  ప్రకాష్ రావు , శంకర్ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment