కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 27 ; తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం బెల్లంపల్లి ఏరియా గోలేటిలోని తెలంగాణ భవన్ లో జండాను ఎగురవేసి సంఘం ఏరియా ఉపాధ్యక్షులు సదాశివ్ మాట్లాడుతూ టి బి జి కే ఎస్ ఆవిర్భవించి నేటికీ పదిహేనేళ్ళైందని, ఈ సంఘం కార్మికుల సంక్షేమం కోసమేనని ,ఈ సంఘం ఆహర్నిశలు కార్మికుల సంక్షేమంకోసం పాటుపడుతున్నదని, ఈ విషయాన్నీ గమనించి మొన్న జరిగిన సింగరేణి ఎన్నికలలో కార్మికులు ప్రధాన గుర్తింపు సంఘంగా ఎన్నుకొన్నారన్నారు. ఈ సందర్భంగా అన్నిబావులవద్ద, ఓపెన్ కాస్ట్ ల వద్ద సంఘం జండాలను ఎగురవేసి కార్మికులు తమ ఆనందాన్ని వ్యక్త పరిచారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రకాష్ రావు , శంకర్ తదితరులు పాల్గొన్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Saturday, 27 January 2018
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం జెండా ఆవిష్కరణ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment