కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 29 ; పోలీసు స్టేషన్ కు వచ్చే బాధితుల ఫిర్యాదుల పట్ల సత్వరం స్పందించాలి అని అధికారులే స్వయముగా ఫిర్యాదు దారుల యొక్క ఫిర్యాదులను తెలుసుకోవాలని జిల్లా ఎస్పి కల్మేశ్వర్ సింగెనవార్ తెలిపారు. సోమవారం స్థానిక జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పి అద్వర్యం లొ ప్రజా ఫిర్యాదుల విబాగం ను నిర్వహించి,వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుల ను జిల్లా ఎస్పి స్వయముగా స్వీకరించారు, ప్రజా ఫిర్యాదు లో నజిజ్ అహ్మద్ జనకాపూర్ ఆసిఫాబాద్ మరియు బొమ్మినేని గిరిబాబు రెబ్బెన లు తమ తమ భూములను అన్యులు అక్రమము గా ఆక్రమించుకొని తమకు అన్యాయం చేస్తున్నారని ఫిర్యాదు చేసారు.వరంగల్ కు చెందిన సంగీత్ రావు తన చెల్లెలి కి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసి మోసం చేశారు అని జిల్లా ఎస్పీ కు ఫిర్యాదు చేశారు.ఇంకా జిల్లా లోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ తమ ఫిర్యాధులను జిల్లా ఎస్పి కు విన్నవించారు సమస్యల పైన స్పందించిన జిల్లా ఎస్పి ఫిర్యాదు దారులకు సాంత్వన చేకురేలా చర్యలు తీసుకుంటానని ఫిర్యాదుదారులకు హామీ ను ఇచ్చారు, తగు సూచనలతో సంబందిత అధికారులను ఫిర్యాదులు పరిష్కారం అయ్యేలా ఆదేశించారు. ఈ కార్యక్రమం లో అడ్మినిస్ట్రేషన్ అధికారి భక్త ప్రహలద్,ఎస్బి సీ ఐ సుధాకర్, డిసీఆర్బీ ఎసై రాణాప్రతాప్,సీనియర్ అసిస్టెంట్ ఇంతియాజ్ , అజయ్ వర్మ ,ఫిర్యాదుల విభాగం అధికారిని సునీత మరియు పీ ఆర్ ఓ మనోహర్ లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment