Monday, 22 January 2018

నిరుపేదలకు 3 ఎకరాల భూమికై వినతి

నిరుపేదలకు 3 ఎకరాల భూమికై  వినతి 
  కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 22;  ప్రభుత్వ భూమిని నిరుపేదలైన లబ్దిదారులకు ఇప్పించాలని ఎం ఎల్ ఏ  కోవలక్ష్మి కి సోమవారం ఆసిఫాబాద్ లోని స్వగృహంలో  తెరాస  జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెబ్బెన ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ ల  ఆధ్వర్యంలో వినతిపత్రం అందచేశారు. అనంతరం మాట్లాడుతూ రెబ్బెన మండలం కొమురవెల్లి గ్రామస్తులు 16 మంది తమ గ్రామా శివారు లోని సర్వే నెంబర్ 189 లోగల 17 ఎకరాల ప్రభుత్వ భూమిని నిరుపేదలైన లబ్దిదారులకు  3 ఎకరాల  చొప్పున భూమిని పంపిణి చేయాలనీ కోరారు.  ఈ కార్యక్రమంలో   ,మాజీ  ఉప సర్పంచ్  పరకాల శ్రీనివాస్ గౌడ్ ,  తెరాస నాయకులూ వాడ్నల   రమేష్, పెద్దింటి మధుకర్, పరకాల సాగర్ గౌడ్ తదితరులు   పాల్గొన్నారు. 

No comments:

Post a Comment