Friday, 12 January 2018

సి ఎస్ పి రైల్వే లైన్ పనుల ను పరిశీలించిన రైల్వే డి ఆర్ ఎం


 కొమురం భీం జిల్లా (వుదయం ప్రతినిధి ) జనవరి  12:   గోలేటి  క్రాస్  నూతనంగా నిర్మిస్తున్న సి ఎస్ పి  రైల్వే  శుక్రవారం రైల్వే డి ఆర్ ఎం  అమిత్ వర్ధన్ శుక్రవారం  పరిశీలించారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులు పనులను మరింత వేగంగా పూర్తి చేయాలనీ సూచించారు. అంతకు ముందు ఆసిఫాబాద్ రైల్వే స్టేషన్లో రెబ్బెన తెరాస నాయకులూ మరియు గ్రామస్తులు  స్టేషన్లో  మౌలిక వసతులు  కల్పించాలని, ఫుట్ ఓవర్  బ్రిడ్జి నిర్మించాలని , గంగాపూర్ రైల్వే గేట్ వద్ద బ్రిడ్జి నిర్మించాలని వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డివిజన్ కో ఆర్డినేటర్ అమిత్ అగ్రవాల్ , సీనియర్ డివిషనల్ సూపరింటెండెంట్ రామ రావు, సీనియర్ డి ఓ ఎం క్రిస్టోఫేర్ ,సీనియర్ డి సీ  ఎం సుమిత్ శర్మ, సీనియర్ డి ఈ ఈ ఆనంద్ చేకిలా , సింగరేణి  బెల్లంపల్లి ఏరియా  జనరల్ మేనేజర్ కిరణ్ ,రైల్వే సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment