కన్నులపండుగగా గంగాపూర్ శ్రీనివాసుడి కళ్యాణం ప్రారంభమైన గంగాపూర్ జాతర
స్వామి వారి కల్యాణం
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 30 ; కన్నులపండుగగా రెబ్బెన మండలంలోని గంగాపూర్ గ్రామా శివారులో వెలిసిన బాలాజీ వెంకటేశ్వరస్వామి వారి కళ్యాణం మంగళవారం నాడు కడురమణీయంగా వైభవంగా వేదమంత్రాల నడుమ వెలది భక్తుల మద్య జరిగింది. భక్తులు స్వామి వారి మండపంలో వేదపండితులచే వేదమంత్రోచ్చారణలతో స్వామివారి కల్యాణాన్ని జరిపించారు. రెబ్బెనమండలంలోని వివిధ గ్రామాలనుంచి భక్తులు తరలి వచ్చి స్వామివారి కల్యాణాన్ని తిలకించి పరవశించారు. కళ్యాణం అనంతరంకొందరుభక్తులుఅన్నదానకార్యక్రమం నిర్వహించారు.మండలంలోని వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో భక్తులకు భద్రతా, త్రాగునీటి సదుపాయం, కల్పించారు. ఈ కార్యక్రమంలో వ లంటీర్లు సేవలు అందించారు. రేపు జరిగే రధోత్సవమునకు వే లాది భక్తులు తరలి వస్తారని నిర్వాహకులు తెలిపారు.
No comments:
Post a Comment