కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 23; తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు మంగళవారం రెబ్బెన మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముంజం రవీందర్ ఆధ్వర్యంలో సర్పంచ్ ఎన్నికలను పరోక్ష పద్దతిలో కాకుండా ప్రత్యక్ష ఎన్నిక విధానంలో నిర్వహించాలని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పంచాయితీ రాజ్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం పంచాయితీ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి మాత్రమే తెలంగాణ ప్రభుత్వం నూతన పంచాయితీ చట్టం ద్వారా సర్పంచ్ ఎన్నికను పరోక్ష పద్దతిలో నిర్వహించడానికి కుట్రపన్నుతుందన్నారు. ఏఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నంబాల కోవూరి శ్రీనివాస్, పాక్స్ చైర్మన్ గాజుల రవీందర్, నాయకులూ దుర్గం రాజేష్, వెంకటేశం చారి, వెంకన్న, దుర్గం దేవాజి, పూదరి హరీష్, జాడి మోహన్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment