Wednesday, 17 January 2018

కేంద్ర రాష్ట్ర వివిధ పథకాలలో పనిచేస్తున్న ఉద్యోగుల ఒక రోజు సమ్మె



కొమురం భీం జిల్లా (వుదయం ప్రతినిధి ) జనవరి  17 :    కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు దేఅవ్యాప్తంగా వివిధ కేంద్ర, రాష్ట్ర  పథకాలలో పనిచేస్తున్న ఉద్యోగులు  బుధవారం ఒక రోజు సమ్మెలో పాల్గొన్నారు. రెబ్బెన మండల తహసీల్దార్ కార్యాలయమున కు   ఊరేగింపుగా వచ్చి జూనియర్ అసిస్టెంట్ లక్ష్మి  నారాయణకు   సి ఐ టి యు జిల్లా అధ్యక్షులు అల్లూరి లోకేష్   వినతి పత్రం అందచేసి అనంతరం మాట్లాడుతూ  ప్రధానంగా తమను కార్మికులుగా గుర్తించాలని, కనీస వేతనం 18000 గ నిర్ణయించాలని, 41 వ లేబర్ కమిషన్ సిఫార్సులను  అమలు చేయాలనీ కోరుతూ ఒక రోజు సమ్మె చేయటం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రెబ్బెన మండలంలో ఆశ,మధ్యాన్న  భోజన ,స్కూల్ స్వీపర్లు, ఐ కే పి  మారియు  వివిధ స్కీం లలో పని చేస్తున్న ఉద్యోగులు పాల్గొన్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ  జిల్లా ఉపాధ్యక్షులు దినకర్, మండల అధ్యక్షులు చంద్రకళ, నాయకులూ రాజేశ్వరి, ప్రమీల, అనిత, సుకన్య, సుధారాణి,  విజయ,తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment