కొమురం భీం జిల్లా (వుదయం ప్రతినిధి ) జనవరి 17 : కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు దేఅవ్యాప్తంగా వివిధ కేంద్ర, రాష్ట్ర పథకాలలో పనిచేస్తున్న ఉద్యోగులు బుధవారం ఒక రోజు సమ్మెలో పాల్గొన్నారు. రెబ్బెన మండల తహసీల్దార్ కార్యాలయమున కు ఊరేగింపుగా వచ్చి జూనియర్ అసిస్టెంట్ లక్ష్మి నారాయణకు సి ఐ టి యు జిల్లా అధ్యక్షులు అల్లూరి లోకేష్ వినతి పత్రం అందచేసి అనంతరం మాట్లాడుతూ ప్రధానంగా తమను కార్మికులుగా గుర్తించాలని, కనీస వేతనం 18000 గ నిర్ణయించాలని, 41 వ లేబర్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలనీ కోరుతూ ఒక రోజు సమ్మె చేయటం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రెబ్బెన మండలంలో ఆశ,మధ్యాన్న భోజన ,స్కూల్ స్వీపర్లు, ఐ కే పి మారియు వివిధ స్కీం లలో పని చేస్తున్న ఉద్యోగులు పాల్గొన్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు దినకర్, మండల అధ్యక్షులు చంద్రకళ, నాయకులూ రాజేశ్వరి, ప్రమీల, అనిత, సుకన్య, సుధారాణి, విజయ,తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment