కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 28 ; రెబ్బెన: తెలంగాణ రాష్ట్రము లో రైతులు పండించే పంటలకు ఎల్లకాలం పుష్కలంగా సాగునీరుని అందించే ఉద్ధ్యేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రవేశపెట్టిన చెరువుల పూడిక తీత మిషన్ కాకతీయ ఫేజ్ -4 పనులను ఆదివారం రెబ్బెన మండలంలోని పలు గ్రామాలలో జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోవా లక్ష్మి ప్రారంభించారు. సందర్బంగా మండలంలోని గ్రామాల్లో పలు చెరువుల పూడిక తీత పనులకు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. అనంతరాం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతో ముందుచూపుతో రైతులకు సాగు నీరు అందించలానే ముఖ్య ఉద్దేశంతో చెరువుల మరమత్తుల పనులు చేపట్టడం ఒక గొప్ప బృహత్తర కార్యక్రమం అని వారు అన్నారు. ప్రతి రైతుకు సాగు నీరు అందించడమే ప్రధాన అంశంగా మిషన్ కాకతీయ పనులు కొనసాగుతున్నాయని అన్నారు.తెలంగాణా ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రజా సౌకర్యాలు మేరుగుపడ్డాయని మిషన్ కాకతీయ చెరువుల పునరుద్దరన,మరమత్తుల వల్ల సాగు భూములకు మేలు జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అజమీర బాబు రావు, ఎంపీటీసీ కర్నాధం సంజీవ్ కుమార్, ,మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ, డి ఈ రవీందర్, ఈ ఈ గుణవంత రావు, తెరాస మండల అధ్యక్షులు పోటు శ్రీధర్ రెడ్డి,తెరాస నాయకులూ చెన్న సోమశేఖర్,,,మల్రాజ్ శ్రీనివాస్, పోతు రెడ్డి, దుర్గం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment