కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 24; తిర్యాణి మండలం విరసం ఘాట్ రోడ్డులో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో మహిళా మృతికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ ఆత్రం భీం రావు నుఅరెస్ట్ చేసి రేమండ్ కు తరలించినట్లు రెబ్బెన సర్కిల్ ఇన్స్పెక్టర్ పురుషోత్తమ చారి బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ నెల 18న ట్రాక్టర్ నెంబర్ టి ఎస్ 19 టి 2027 ట్రాక్టర్లో 15 మందిని ఎక్కించుకొని నిర్లక్ష్యంగా ట్రాక్టర్ ను నడపడంతో ట్రాక్టర్ బోల్తాపడి దేవు బాయి అక్కడి కక్కడే మరణించగా, 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతురాలి భర్త జలపాతి ఫిర్యాదు మేరకు కేసు బుక్ చేసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.
No comments:
Post a Comment