కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 25 ; జాతీయ ఓటర్ దినోత్సవం సందర్బంగ గురువారం రెబ్బెన తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రభుత్వ కళాశాల, పాఠశాల విద్యార్థులతో మానవహారం నిర్వహించి ఓటర్ ప్రతిజ్ఞ చేసారు. ఈ సందర్భంగా రెబ్బెన తహసీల్దార్ విష్ణు, ఏఎంసీ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ లు మాట్లాడుతు 18 సం"రాలు వయసు నిండిన యువతీ యువకులు తమ ఓటు హక్కు పొందటానికి విధిగ దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. జనవరి 25 న ఓటర్ దినోత్సము సదర్బంగా యువకులు ఓటు హక్కు పొందడానికి ప్రతేకంగా పోలింగ్ కేంద్రలను ఏర్పాటు చేయడం జరిగిందని,కేంధ్రాలలో దరఖాస్తులు తీసుకొని కొత్త ఓటర్లను నమోదు చేసుకోవడం జరుగుతుందని అన్నారు.పరిసర ప్రాంతాలలో నివాసం వుండే చదువుకోని ప్రజలు నమోదు చేసుకోకుండా ఉంటె వారికీ అవగాహన కల్పించి నమోదు చేసుకునేందుకు విద్యార్థులు సహకరించిగలరని కోరారు.ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు వయోజనులు కాగానే విధిగా ఓటు హక్కునిపొంది మంచి నాయకున్ని ఎన్నుకొని అవినీతి రహిత సమాజాన్ని రూపుదిద్దాలని వారు విద్యార్థులకు సూచించారు.ఓటు హక్కు పొందిన తర్వాత స్వేచ్ఛగా దానిని ఉపయోగించుకోవాలని,డబ్బులకు,మందు విందులకు ఓటును అమ్ముకోవడం నేరమని అన్నారు.భారత పౌరులమైన మేము,ప్రజాస్వామ్యం పై విశ్వాసంతో,మన దేశ ప్రజాస్వామ్య సాంప్రాదాయాలను,స్వేచ్చయుత,నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల వాతావరణాన్ని నిలబెడాతామని,మతం,జాతి,కులం,వర్గం,బాష, ప్రాంతం వంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము అని విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజలు ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో రెవిన్యూ ఇన్స్పెక్టర్ అశోక్ చౌహన్, కళాశాల ఉపాధ్యాయులు అమరేంద్రనాథ్, ప్రకాష్, గంగాధర్, రెబ్బెన మండల రెవిన్యూ కార్యాల ఉద్యోగులు ఊర్మిళ, బాపు, మల్లేష్, ఉమ్లాల్ ,శ్రీనివాస్, అంగన్వాడీ కార్యకర్తలు ప్రమీల, తిరుపతమ్మ, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment