Tuesday, 23 January 2018

సింగరేణిలో పదోన్నతులపై ఖాళీల భర్తీకి వ్రాత పరీక్షల నిర్వహణ

 కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 23;  బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి జనరల్ మేనేజర్ కార్యాలయములో మంగళ వారంనాడు సర్వే  మజ్దూర్, అసిస్టెంట్ ఛైన్మన్,హెడ్ ఛైన్మన్ ఖాళీల భర్తీకి వ్రాత పరీక్ష మరియు టెక్నికల్ పరీక్ష  నిర్వహించినట్లు ఏరియా డీజీఎం  జె కిరణ్ తెలిపారు.    ఈ  సందర్భంగా జనరల్ మేనేజర్  రవిశంకర్   మాట్లాడుతూ పదోన్నతులపై  ఖాళీల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్షలలో మౌఖిక పరీక్షలేకుండా పూర్తి పారదర్శకతతో నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ పరీక్షా నిర్వహణలో ఎస్ ఓ టు జీఎం  ఎం శ్రీనివాస్, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ రామకృష్ణ ,డిప్యూటీ పర్సనల్ మేనేజర్ సుదర్శనం. ఇతర అధికారులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment