సేవాలాల్ మహారాజ్ జయంతిను ప్రభుత్వం అధికారికంగా చేపట్టాలి
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 22; సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికం గ చేపట్టాలని సేవాలాల్ కొమురం భీం జిల్లా కమిటీ అధ్యక్షులు బి శివప్రసాద్ డిమాండ్ చేసారు. కొమురం భీం జిల్లా రెబ్బెన మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో సేవాలాల్ జిల్లా కమిటీ సమావేశం బి శివప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ లంబాడీల డిమాండ్ల సాధనకు స్టీరింగ్ కమిటీ ని ఎన్నుకున్నట్లు తెలిపారు. లంబాడీల ఆరాధ్య దైవమైన సంత్ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ జన్మదిన వేడుకలను ఫిబ్రవరి 15 నుండి 23 తేదీవరకు ప్రభుత్వమే అధికారకంగా నిర్వహించాలని, ఫిబ్రవరి 15 న సెలవు దినంగా ప్రకటించాలని, జయంతి ఉత్సవాల నిర్వహణకు జిల్లాకు 10 లక్షల చొప్పున 3 కోట్లు విడుదలచేయాలని,లంబాడి తండాలను రెవిన్యూ పంచాయితీలుగా గుర్తించి జీవో జారీచేయాలని ,లంబాడీలకు 10 శాతం రేజర్వేషను కల్పించాలని, తెలంగాణలోని ప్రతి తండాకు ఏజెన్సీ హోదా కల్పించాలని అన్నారు. ఆదివాసీలు తమపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని కోరారు. లంబాడీలపై ప్రభుత్వం పెట్టిన కేసులను బె షరతుగా ఎత్తివేయాలన్నారు. ఈ నెల 29న ఈ సమస్యలపై ప్రతి మండల తహసీల్దార్లకు పై డిమాండ్లతో వినతి పత్రం అందచేయడం జరుగు తుందన్నారు. ఫిబ్రవరి 5 న అన్ని జిల్లాల కలెక్టర్లకు సేవాలాల్ సేవ నాయకులూ అందచేయడం జరుగు తుందన్నారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ రాష్ట్ర అధ్యక్షులు దారావత్ ప్రేమ్ చాంద్ నాయక్,రాష్ట్ర ఉపాధ్యక్షులు జీవంత్ నాయక్, ప్రధాన కార్యదర్సులు ఆర్ రాథోడ్, జాదవ్, బాపు రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ రాము నాయక్, రెబ్బెన జడ్పీటీసీ అజ్మీరా బాబు రావు, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు సురేష్ నాయక్,ఆత్మారాం నాయక్, నాయకులూ భరత్ బాబు, కిషన్, రాంకుమార్, మోహన్, తిరుపతి, శంకర్ నాయక్ తదిత రులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment