కొమురం భీం జిల్లా (వుదయం ప్రతినిధి ) జనవరి 17 : రెబ్బెన మండలం గోలేటిలో బుధవారం లయన్స్ క్లబ్ గోలేటి స్పోర్ట్స్ మరియు బెల్లంపల్లి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో సింగరేణి హై స్కూల్ విద్యార్థులకు ఉచిత్త కంటి పరీక్షలు నిర్వహించటం జరిగిందని లయన్ ఆర్ నారాయణ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి సింగరేణి జి ఎం రవిశంకర్, డిప్యూటీ జి ఎం కిరణ్ లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలు సమాజానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ సందర్భంగా ప్రోగ్రాము చైర్మన్ తిరుపతి రెడ్డి, లయన్ సీ వినోద్ ప్రైమరీ పాఠశాల విద్యార్థులకు 300 వాటర్ బాటిళ్లను అందచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా లయన్స్ క్లబ్ చీఫ్ కో ఆర్డినేటర్ టి వెంకటేశ్వర్లు, కార్యదర్శి భాస్కర్, కోశాధికారి శంకర్, మెంబర్షిప్ చైర్మన్ జె సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి శ్రీధర్, మూర్తి, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment