కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 24; రెబ్బెన మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల నుండి ఇద్దరు నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ కు ఎన్నికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణలత ఒక తెలిపారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న బిర్సా శ్రావణి, మోడెమ్ అజయగౌడ్లు ఈ మెరిట్ స్కాలర్ షిఫ్కు ఎన్నికయ్యారని, ప్రభుత్వ పాఠశాలలో స్వేచ్చాయుత వాతావరణంలో విద్యార్థులకు ప్రతిభావంతమైన విద్యనందించడం జరుగుతుందన్నారు. ఇతర విద్యార్థిని,విద్యార్థులు ఈ విరినీ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయులు విజయలక్ష్మి, సీమ, ఆలిస్ అహ్మద్, రోజా రమణి, కవిత,పార్వతి ఈ ఇద్దరు విద్యార్థులకును అభినందించారు.
No comments:
Post a Comment