యన్ టీ ఆర్ 22వ వర్దంతి పురస్కరించుకొని పూలాభిషేకం
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 18 ; రెబ్బెన: స్వర్గీయ యన్ టీ ఆర్ 22 వ వర్దంతి పురస్కరించుకొని గురువారం రోజున రెబ్బెన మండల కేంద్రంలో మండల తే.దె.పా ఆద్వైర్యంలో ఎం టి ఆర్ విగ్రహానికి ఆసిఫాబాద్ జిల్లా పార్టీ కార్యదర్శి కుడుమేత హన్మంతరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు సొల్లులక్ష్మి లు పూలమాలలు వేశారు. పార్టీ జండా ఎగరవేసి అనంతరం పండ్ల పంపిణి చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలుగు దేశం పాలన హయాంలో తెలంగాణా ప్రాంతం ఎంతో అభివృద్ధి జరిగిందని అన్నారు. బిసి ఎస్సి ఎస్టీ మైనారిటీ లకు హక్కుల సాధనలో ఎం టి ఆర్ వారి కష్ట సుఖాలలో పాలు పంచుకుని ఎంతో కృషి చేశారన్నారు. తెలుగు దేశం పేదల పార్టీ రాబోయే రోజుల్లో టిడిపి జెండా ఎగరడం ఖాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమములో మండల అధ్యక్షుడు విజయ్, మండల మహిళా అధ్యక్షురాలు ఏ విమల, నాయకులూ మనోహర్, గులాబీ, నాందేవ్ తదితరురులు ఉన్నారు .
No comments:
Post a Comment