కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 29 ; రెబ్బెన మండలం ఖైర్గుడా గ్రామంలోని ప్రభుత్వప్రాధమిక పాఠశాల విద్యార్థుల కు రక్షిత మంచినీరు అందించే ఉద్దేశంతో అదే గ్రామానికి చెందిన పాఠశాల పూర్వ విద్యార్థి షేక్ అజీమ్ సోమవారంనాడు వాటర్ ఫిల్టర్ ను విరాళంగా అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇదే పాఠశాలలో చదువుకున్నానని ఆ అభిమానంతో విద్యార్థుల ఉపయోగం కోసం రక్షిత మంచినీటి పరికరాన్ని అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి, ఉపాధ్యాయులు, తది తరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment