Monday, 29 January 2018

ప్రభుత్వప్రాధమిక పాఠశాలలో వాటర్ ఫిల్టర్ వితరణ




కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 29 ;   రెబ్బెన మండలం ఖైర్గుడా గ్రామంలోని ప్రభుత్వప్రాధమిక   పాఠశాల  విద్యార్థుల కు రక్షిత మంచినీరు అందించే ఉద్దేశంతో  అదే గ్రామానికి చెందిన పాఠశాల పూర్వ విద్యార్థి షేక్  అజీమ్ సోమవారంనాడు వాటర్  ఫిల్టర్ ను విరాళంగా అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇదే పాఠశాలలో చదువుకున్నానని ఆ అభిమానంతో విద్యార్థుల ఉపయోగం కోసం  రక్షిత మంచినీటి పరికరాన్ని అందించినట్లు తెలిపారు. ఈ  కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి, ఉపాధ్యాయులు, తది తరులు పాల్గొన్నారు.   

No comments:

Post a Comment