Tuesday, 30 January 2018

పశువులకు నట్టల మందు పంపిణి

పశువులకు  నట్టల మందు పంపిణి 

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 30 ;  కొమురం భీం జిల్లాలోని రెబ్బెన మండలం ఇందిరానగర్ గ్రామంలో గొర్రెలకు, మేకలకు సామూహికంగా జిల్లా పశు  వైద్యాధికారి డాక్టర్ కుమారస్వామి ఆధ్య్వర్యంలో  నట్టల నివారణ మందును పంపిణి చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఇందిరానగర్ గ్రామంలో 330  గొర్రెలకు, 71 మేకలకు మందును  అందించడం జరిగిందన్నారు.  ప్రభుత్వం సబ్సిడీ పై అందచేసిన గొర్రెలను సరైన యాజమాన్య పద్దతిలో పెంచుకొని ఆర్ధికంగా లబ్ది పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  రెబ్బెన సర్పంచ్ పెసర వెంకటమ్మ ,మండల పశు వైద్య సిబ్బంది డాక్టర్ సాగర్  తదితరులు పాల్గొన్నారు. 



No comments:

Post a Comment