పశువులకు నట్టల మందు పంపిణి
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 30 ; కొమురం భీం జిల్లాలోని రెబ్బెన మండలం ఇందిరానగర్ గ్రామంలో గొర్రెలకు, మేకలకు సామూహికంగా జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ కుమారస్వామి ఆధ్య్వర్యంలో నట్టల నివారణ మందును పంపిణి చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరానగర్ గ్రామంలో 330 గొర్రెలకు, 71 మేకలకు మందును అందించడం జరిగిందన్నారు. ప్రభుత్వం సబ్సిడీ పై అందచేసిన గొర్రెలను సరైన యాజమాన్య పద్దతిలో పెంచుకొని ఆర్ధికంగా లబ్ది పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన సర్పంచ్ పెసర వెంకటమ్మ ,మండల పశు వైద్య సిబ్బంది డాక్టర్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment