Monday, 22 January 2018

నిరుపేద బ్రాహ్మణులకు ప్రభుత్వం చేయూత ; ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్


 నిరుపేద బ్రాహ్మణులకు ప్రభుత్వం చేయూత ; ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 22;    బ్రాహ్మణులకు ప్రభుత్వం అన్ని విధాలా  చేయూతనిస్తుందని  ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ అన్నారు . సోమవారం కొమురం భీం జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్ లో బ్రాహ్మణ పరిషత్ సాధికార సహాయత కేంద్రం ను  ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో బహిర్గతమైన చేదు నిజం ఏమిటంటే 90 శాతం మంది బ్రహ్మాంలు కటిక దారిద్యంలో జీవనం సాగిస్తున్నారని , అందుకు ముఖ్య మంత్రి కెసిఆర్ తెలంగాణ   బ్రాహ్మణ కుటుంబాలకు చేయూతనిచేటట్లుగా బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేసి 200 కోట్ల నిధులను కేటాయించారు. ఇందుకు గాను బ్రాహ్మణా కుటుంబాలుఆర్దికంగా ఎదగడానికి స్వయం ఉపాధి పొందేందుకు రుణ సహాయాన్ని అందేచేయుటకు దరఖాస్తు చేసుకోవాలన్నారుఅం దుకు ఈ కేంద్రం సహాయ పడుతుందన్నారు. బ్రాహ్మణులూ కేవలం పౌరోహిత్యానికే పరిమితం కాకుండా సామాజికంగా, ఆర్ధికంగా ,రాజకీయంగా ఎదగాలని కెసిఆర్ ఆకాంక్ష అన్నారు. ఎం ఎల్ ఏ  కోవలక్ష్మి  మాట్లాడుతూ జిల్లాలోని బ్రాహ్మణా సమాజానికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయ.ని , బ్రాహ్మణా పరిషత్ ద్వారా పేద బ్రాహ్మణ ఆడపిల్లల పెళ్ళికి 3 లక్షల రూపాయలు అందచేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ దామోదర్ రెడ్డి,  జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ గంధం శ్రీనివాస్, పాక్స్ చైర్మన్ అలీ బిన్ అహ్మద్,  తెరాస నాయకులూ సోమశేఖర్, బొమ్మినేని శ్రీధర్, గాడివేణి మల్లేష్, అజయ్,    స్థానిక తహసీల్దార్, బ్రాహ్మణ పరిషత్ నాయకులూ శ్రీనివాస్, సోను, తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment