కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 19 ; రెబ్బెన: జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని టి డబ్ల్యూ యు జె ( ఐ జె యు ) కొమురం భీం జిల్లా కార్యవర్గ సమావేశంలో జిల్లా అధ్యక్షులు అబ్దుల్ రహమాన్, ప్రధాన కార్యదర్శి ఎస్ సంపత్ కుమార్ ,రాష్ట్ర కార్యవర్గ నాయకుల బి సదానందంలు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక మైనారిటీ ఫంక్షన్ లో . అధ్యక్షులు అబ్దుల్ రహమాన్ ఆధ్వర్యంలోజరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో యూనియన్లతో సంబంధం లేకుండా అర్హులైన విలేఖరులందరికి అక్క్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని, విలేకరులకు డబల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరుచేయాలని చర్చించినట్లు,తదుపరికార్యాచరణ ,యూనియన్ బలోపేతం గురించి చర్చించామని చెప్పారు. ఇకనైనా .ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కృష్ణం రాజు, అబ్దుల్ జమీల్, సుధీర్ , కోశాధికారి అడపా సతీష్, ఆక్రెడిటేషన్ కమిటీ మెంబెర్ ప్రకాష్ గౌడ్, జాయింట్ సెక్రటరీ సునీల్ , కార్యనిర్వాహక సెక్రటరీ కొల్లి సునీల్ కుమార్, కార్యవర్గ సభ్యులు రాంబాబు,ఖలీల్ అహ్మద్, రామేశ్వర్, నాయక్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment