కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) జనవరి 4 ; రెబ్బెన మండలంలోని గోలేటిలో గాలికుంటు వ్యాధుల నివారణకు టీకాలు వేయటం జరిగిందని రెబ్బెన మండల పశువైద్యాధికారి డాక్టర్ సాగర్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందస్తు చర్యలుగా వ్యాధిని గుర్తించి టీకాలు వేయడం వల్ల గాలికుంట వ్యాధులను నివారించవచ్చని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మొత్తం 253 పశువులకు టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. జెడ్ పి టి సి అజమీర బాపూరావు, ఎం పి టి సి మురళీబాయి, పశు వైద్య సిబ్బంది తదితరలున్నారు.
No comments:
Post a Comment