కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Wednesday, 31 January 2018
హరినామస్మరణతో హోరెత్తిన గంగాపూర్
Tuesday, 30 January 2018
కన్నులపండుగగా గంగాపూర్ శ్రీనివాసుడి కళ్యాణం
జాతిపితకు శ్రద్ధాంజలి
సాంకేతిక కారణాలతో నిలిచిన పాట్నా ఎక్సప్రెస్
ఈ పాస్ విధానంలో రేషన్ సరకుల సరఫరా
పశువులకు నట్టల మందు పంపిణి
Monday, 29 January 2018
పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుల పట్ల తక్షణం స్పందిచాలి – జిల్లా ఎస్పి కల్మేశ్వర్ సింగెనవార్
వికలాంగులందరికి ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందచేయాలి
ప్రభుత్వప్రాధమిక పాఠశాలలో వాటర్ ఫిల్టర్ వితరణ
Sunday, 28 January 2018
కోరిన వరాలిచ్చే గంగాపూర్ బాలాజీ


కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 28 ; రెండవ తిరుపతిగా తెలంగాణాలో పేరొందిన శ్రీ బాలాజీ వేంకటేశ్వరస్వామి దేవాలయం కొమురం భీం అసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం లోని గంగాపూర్ గ్రామ శివారులో గల గుట్ట పై కొలువై ఉన్నాడని భక్తుల ప్రగాఢనమ్మకం. ప్రీతి ఏటా మాఘశుద్ధ పౌర్ణమి నాడు తిరుపతిలో కొలువైన భగవానుడు గంగాపూర్ కి వస్తాడని తిరుపతి లో కొన్ని ఘడియలు పాటు దేవస్థాన సింహద్వారాలు మూసివేస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకం.శ్రీ వేంకటేశ్వరస్వామి సతీసమేతంగా కొలువై ఉండడంతో పాటు శివాలయం ,హనుమంతుని విగ్రహలు కొలువై ఉన్నాయి కావున ఇట్టి దేవాలయం ను రెండవ తిరుపతిగా ప్రజలు భావిస్తారు. ఈ దేవాలయం 13వ శతాబ్దానికి ముందు వెలిసినది అని చారిత్రక ఆధారాల ప్రకారం గంగాపూర్ గ్రామానికి చెందిన ముమ్మడి పొతాజి విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు అతడికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఫై అమితమైన భక్తి కలిగి ఉండేది దీనితో ప్రతి ఏటా అతను తిరుమల తిరుపతి దేవస్థానానికి కాలిబాటన వెళ్లి మొక్కులు తీర్చుకునేవాడు. అతని వయస్సు ఫై బడడం తో స్వామి వారి వద్దకు వెళ్లే పరిస్థితి లేక పోవడం తో మనస్థాపానికి గురయ్యాడు దీనితో స్వయంగా శ్రీ వెంకటేశ్వరా స్వామి కనిపించి నీవు చింత చెందవలసిన అవసరం లేదని గంగాపూర్ శివారులోని గుట్టపై ప్రకృతి ఒడిలో దర్శనం ఇచ్చి వెలిసాడు అప్పటినుండి ప్రతి సంవ్సతరం మాఘశుద్ధ పౌర్ణమి కి మూడు రోజులపాటు జాతర ఘనంగా నిర్వహిస్తారు మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరలో రెండవ రోజును భక్తులు పవిత్ర దినంగా భావిస్తారు కొత్తగా ఏర్పాటైన కుమరంభీమ్ జిల్లాలో అతిపెద్ద జాతరగా జరగనుంది. గంగాపూర్ జాతరలో మరో ప్రత్యేక త రథోత్సవం కార్యక్రమం జాతరలో రెండో రోజున శ్రీవెంకటేశ్వర స్వామి సతిసమేతంగా రథోత్సవంలో వేలాది భక్తులు పాల్గొంటారు . ఈ జాతరకు ఆసిఫాబాద్ మరియు మంచిర్యాల డిపోల నుండి బస్సు సౌకర్యం కలదు . ఈ నెల 30,31 లలో జరిగే కళ్యాణం మరియు జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని దేవాలయ కార్యనిర్వహణాధికారి బాపి రెడ్డి, స్వచ్చంద సంస్థలైన వెంకటేశ్వర యూత్ సంఘం అధ్యక్షులు విలాస్ తెలిపారు.
గంగాపూర్ దేవాలయంలో 30న కళ్యాణం లడ్డు వేలం
నాలుగో విడత మిషన్ కాకతీయ పనులు ప్రారంభం
రెండు వేల పందొమ్మిది ఎన్నికలలో గెలుపు బీజేపీదే : జేబి పౌడెల్
దొంగ నోట్ల చలామణి చేసేతున్నముఠా అరెస్ట్
- 4,06,100 /- రూపాయలు, 6 మొబైల్ ఫోన్ లను స్వాదినం
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 28 ; కుమ్రం భీమ్ జిల్లా కాగజ్ నగర్ ప్రాంతం లో గత కొంతకాలంగా దొంగ నోట్లను చలామణి చేసే ముఠాను ఆదివారం అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పి కల్మేశ్వర్ సింగేనవార్ మీడియా ప్రతినిదులకు వెల్లడించారు. జిల్లా లోని స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్ నందు గల పోలీస్ సమావేశ మందిరము లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పి మాట్లాడుతూ 6 గురు నిందితులు గల ముఠా జిల్లా లోని కొన్ని ప్రాంతాలలో నఖిలి నోట్లు చలామణి చేస్తుండగా పక్కా సమాచారం తో వారిని పట్టుకోవడం జరిగిందని తెలిపారు. విలాసవంతమైన జీవితం కోసం నిందితులు ఒక ముఠా గా ఏర్పడి 100 దొంగనోట్లకు 30 అసలు నోట్లు గా చలామణి చేసేలా ఒప్పందం తో 4,06,100/- తో కాగజ్ నగర్ వచ్చి 1,72,300/- ఇచ్చి మిగితా నకిలీ నోట్లుతో బస్సు లో అక్కడ నుంచి వెళ్లి పోయారు . 27.01.2018 నాడు నమ్మదగిన సమాచారం మేరకు కాగజ్ నగర్ పోలీసులు , స్పెషల్ బృందం తో పక్క ప్రణాళిక తో వల పన్నిముగ్గురు నిందితులను రైల్వే స్టేషన్ ఏరియా నందు, మిగతా ముగ్గురిని బస్సు స్టేషన్ సమీపమందు పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. మరియు వారి దగ్గర గల మొత్తం నకిలీ నోట్లవిలువ 4,06,100 /- రూపాయలు, 6 మొబైల్ ఫోన్ లను స్వాదినం చేసుకొని వారిని అదుపులోకి కేసు నమోదు చేయడం చేయడం జరిగిందన్నారు.
Saturday, 27 January 2018
నేడు పల్స్ పోలియో కార్యక్రమం
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 27 ; జాతీయ పోలియో నిర్ములన కార్యక్రమంలో భాగంగా నేడు జరిగే పల్స్ పోలియో కర్తక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని డిప్యూటీ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సీతారాం చెప్పారు. రెబ్బెన మండలం ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన సమీక్షలో మాట్లాడుతూ మండలంలో ఉన్న అన్ని గ్రామాలలో ఉన్న 0 నుండి 5 సంవత్సరాల పిల్లలకు తప్పని సరిగా పోలియోచుక్కలు వేయించాలని, ఇంటింటికి వైద్య సిబ్బంది వచ్చే ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రధాన బస్టాండ్లలో కూడా సిబ్బంది అందుబాటులో ఉంటారంన్నారు.
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం జెండా ఆవిష్కరణ
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 27 ; తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం బెల్లంపల్లి ఏరియా గోలేటిలోని తెలంగాణ భవన్ లో జండాను ఎగురవేసి సంఘం ఏరియా ఉపాధ్యక్షులు సదాశివ్ మాట్లాడుతూ టి బి జి కే ఎస్ ఆవిర్భవించి నేటికీ పదిహేనేళ్ళైందని, ఈ సంఘం కార్మికుల సంక్షేమం కోసమేనని ,ఈ సంఘం ఆహర్నిశలు కార్మికుల సంక్షేమంకోసం పాటుపడుతున్నదని, ఈ విషయాన్నీ గమనించి మొన్న జరిగిన సింగరేణి ఎన్నికలలో కార్మికులు ప్రధాన గుర్తింపు సంఘంగా ఎన్నుకొన్నారన్నారు. ఈ సందర్భంగా అన్నిబావులవద్ద, ఓపెన్ కాస్ట్ ల వద్ద సంఘం జండాలను ఎగురవేసి కార్మికులు తమ ఆనందాన్ని వ్యక్త పరిచారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రకాష్ రావు , శంకర్ తదితరులు పాల్గొన్నారు.
రెబ్బెన మండల తహసీల్దార్ గా సాయన్న
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 27 ; రెబ్బెనమండల తహసీల్దార్ గ ఎస్ సాయన్న పదవీబాధ్యతలు స్వీకరించారు. గత కొన్ని నెలలుగా డిప్యూటీ తహసీల్దార్ విష్ణు ఇంచార్జి తహసీల్దారుగా వ్యవహిరిస్తున్నారు. శనివారం ఆసిఫాబాద్ రెవిన్యూ డివిషనల్ కార్యాలయంలో డివిషనల్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా పనిచేస్తున్న సాయన్నను బదిలీపై రెబ్బెన మండల తహసీల్గ్దర్ గ నియమిస్తూ ఉత్తరువులు రావడంతో సాయన్న రెబ్బెన మండల కార్యాలయంలో పదవీబాధ్యతలు స్వీకరించారు.