Monday, 11 April 2016

ప్రమాదంలో ప్రజలు - పట్టించుకోని విద్యుతు అధికారులు

  ప్రమాదంలో ప్రజలు - పట్టించుకోని విద్యుతు అధికారులు 

(రెబ్బెన వుదయం ప్రతినిధి)  రెబ్బెన మండలంలోని గొల్లగూడెం గ్రామంలో దారికి అడ్డంగా  ట్రాన్స్ ఫారముతో  కూడిన విద్యుత్ స్తంభము  వైర్లు కిందకు వేలాడుతూ వున్నాయి. ఆ విద్యుత్  కరెంట్ తీగల  వల్ల పశువులు, చిన్న పిల్లలు అ  దారికి వెళ్ళేటపుడు ఎప్పుడు ఎ ప్రమాదము ముంచుకొస్తుందో నని ప్రజలు భయా భ్రాన్తులకు గురి అవుతున్నారు. కరెంట్ ట్రాన్స్ ఫారముతో  కూడిన విద్యుత్ స్తంభము వైర్లు కిందకి వేలాడుతున్నాయని, చిన్న పిల్లలకు సైతం అందేలా వున్నయిని ప్రజలు భయపడుతున్నారు . విద్యుత్ అధికారులతో  మొరపెట్టుకున్న పట్టించుకోవడము లేదని  గ్రామస్తులు అంటున్నారు.  ఇటివల కాలంలో  విద్యుతు వైర్ల వలన చాలా ప్రమాదాలు జరిగాయి  కాని ఇది అధికార్ల నిర్లక్ష్యానికి అద్దం పట్టినట్లు కనబడుతున్నదని  గ్రామ  వాసులు అంటున్నారు . ఇప్పటికైనా  ఉన్నత అధికారులు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని , విద్యుతు స్తంభం వైర్లు వేలాడ కుండా చేయాలనీ,  స్తంభం  చుట్టూ కంచె వేయాలని ప్రజలు కోరుతున్నారు.  

No comments:

Post a Comment