విచ్చల విడిగా చేసే ఇసుక రవాణాను అరికట్టాలి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); గంగాపూర్ గ్రామ వాగు నుండి అక్రముగా విచ్చల విడిగా ఇసుక అనుమతి లేకుండా రవాణా చేస్తున్నవాహనదారులపై చర్య తీసుకోవాలని లక్ష్మిపుర్ గ్రామా ప్రజలు గురువారం నాడు రెబ్బెన తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం తహసిల్దార్ రమేష్ గౌడ్ అందచేశారు అనుమతి లేని వాహనాలు రాత్రి పగలు లక్ష్మిపుర్ గ్రామం నుంచి విచ్చల విడిగా ఇసుక ను అదే పనిగా తరలిస్తువుంటే త్రాగు నిరుకి ఇబ్బంది అవుతుంది అని, ఎన్ని బోర్లు వేసిన నీళ్ళు రావడం లేదని అదే పని ఇసుక రవాణా చేయడం వల్ల బుగర్బ జలం ఇంకి పోయి బావిషత్తు యందు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురి అవ్వడం జరుగుతుందని బయపడుతున్నారు . అయితే ఇట్టి విషయం పై గతంలో చాలా సార్లు తహసిల్దార్ దృష్టికి తీసికొని వెళ్ళిన కొన్ని రోజుల తరవాత మళ్ళి యదేచ్చంగా రవాణా జరుపుతున్నారు అనుమతి ఇచ్చిన పత్రాలు వాహన దారులు రాత్రి పగలు ఇసుక రవాణా వేరే వేరే ప్రదేశాలకు చేరవేయడం జరుగుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రెవెన్యూ పరిధి లోని అనుమతి ఇవ్వకుండా పూర్తి సమాచారం జరిపిన తర్వాతే, ఇసుక రవాణా అనుమతి లేని పక్షంలో గ్రామంలోని ప్రజలు తీవ్ర ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కావున గంగాపూర్ గ్రామా పంచాయితీ వాగు నుండి ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వకుండా చేస్తానని ,బుగర్బ జలాలు ఇంకా కుండా ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ అన్నారు ఈ ధర్నా లో గంగాపూర్ గ్రామా సర్పంచ్ ముంజం రవీందర్, ch . సుభాష్, ch నాగయ్య ,సాంబయ్య ,లింగయ్య సాయిరే మాధవ్, బాపు,మోహన్,వాసుదేవ్, రావుజి ,భీమయ్య ,పిప్రె భీమయ్య ,లేకురే రవి , వెంకట్ రావు , చందు , రాజేందర్ , రమేష్ , సోమయ్య , శ్రీను ,ఆనంద్ రావు ,శ్యాం రావ్ బాబాజి ఆశన్న మరియు లక్ష్మిపుర్ గ్రామా ప్రజలు పాల్గొన్నారు
No comments:
Post a Comment