Saturday, 9 April 2016

ఘనముగా చండ్ర రాజేశ్వర్ రావు 22 వ వర్ధంతి

 ఘనముగా చండ్ర రాజేశ్వర్ రావు 22 వ వర్ధంతి 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలం గోలేటి టౌన్ షిప్ లోని కె . ల్ మహేంద్ర భవన్ లో శనివారం రోజున చండ్ర  రాజేశ్వర్ రావు 22 వ వర్ధంతి అఖిల భారత యువజన సమాఖ్య ఎ ఐ వై  ఫ్  అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఎ ఐ స్ ఫ్ అధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్బముగా  ఎ ఐ వై  ఫ్ జిల్లా అధ్యక్షుడు బోగే ఉపేందర్ ,  ఎ ఐ స్ ఫ్  జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ మాట్లాడుతూ చండ్ర రాజేశ్వర్ రావు భారత కమ్యునిస్టు పార్టీ కి ఎనలేని సేవలు చేశారు ముఖ్యముగా బడుగు బలహీన వర్గాల అబ్యునతి కోసం పేద ప్రజల హక్కుల కోసం,ఎన్నో పోరాటాలు చేశారు 1959 మే , 31 న ఎ ఐ వై  ఫ్ ని అవిర్బవించాడని నాటి  నుంచి ఎన్నో ఉద్యమాలు చేశారని అన్నారు అందరు యువతి యువకులు విద్యార్థులు చండ్ర రాజేశ్వర్ రావు ఆశయాలకు అనుగుణముగా ఉద్యమాలు చేశారని అన్నారు . ఈ కార్యక్రమంలో ఎ ఐ వై  ఫ్ మండల ఉపాధ్యక్షుడు మలిశెట్టి మహిపాల్ , పారిపండ్ల  రమేష్ , దుంపల బాపు , చంద్రయ్య ,  రవి , తదితరులు పాల్గొన్నారు .

No comments:

Post a Comment