Tuesday, 12 April 2016

మండుతున్న బానుడు అల్లాడుతున్న ప్రజలు


                      మండుతున్న బానుడు అల్లాడుతున్న ప్రజలు 
(రెబ్బెన వుదయం ప్రతినిధి) ఎండలు రోజు రోజుకి పెరగటం వలన ప్రజలు మద్యాహం పూట బయటకు రావాలంటే బయపడుతున్నారు . వరుసగా పెరిగుతున్న ఉష్నోగ్రతలకు రెబ్బెన మండల  ప్రజలు బెంబలెత్తి పోతున్నారు.  ఎండ సెగకు  రోడ్లన్ని ఖాళీగా కనిపిస్తున్నాయి . ఏప్రిల్ లోనే పరిస్టితి ఇ లా ఉందంటే  ఇంకా ముందు ముందు తీవ్రత ఎంత మెర ఉంటుందోనని  ప్రజలు అందోళనతో  ఎండలు బాబోయి ఎండలు అని గగ్గోలు పెడుతున్నారు. ఇదే పరిస్థితి కోనసాగితే ప్రజలకు నీటి సమస్య తలెత్తి నానాఇబ్బందులకు గురి కాకతప్పదు.  ఉదయం 10 గంటలు దాటితేనే రోడ్లన్ని నిర్మానుష్యంగా మారుతున్నాయి. గత కొన్ని  రోజులుగా ఎండతీవ్రత పెరిగిపోవడంతో వృద్దులు పిల్లలు బయటకు రావాలంటే బెంబేలెత్తుతున్నారు.అధిక ఉష్ణోగ్రతల వల్ల ప్రజల ఆరోగ్యం పై ప్రభావం చూపుతుందని భయాందోలనకు గురవుతున్నారు. ఎండ తీవ్రతకు ప్రజలు రోజువారి పనులకు వెళ్ళాలంటే జంకుతున్నారు  బానుడి ప్రతాపంతో ప్రజలు అల్లాడి పోతున్నారు.  





No comments:

Post a Comment