గుర్తు తెలియని వాహానం డీకొని 16 గొర్రెలు మృతి 2గాయాలు
(రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలములోని నక్కల గూడా సమీపములో జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహానం డీకొని 16 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా 2 గొర్రెలకు తీవ్ర గాయాలయాయి . రాజయ్య గొర్ల కాపరి తెలిపిన వివరాల ప్రకారము మంగళ వారము రాత్రి నక్కల గూడా జాతీయ రహదారిపై గొర్ల మందను దాటిస్తుండగా మామిడిపళ్ళ లోడుతో ఉన్న ట్రాలీ అతివేగంగా వచిందని, చేతి ఊపిన ఆపకుండా గోర్లపై నుండి దూసుకేల్లిందని , కళ్ళెదుటే ఈ దారుణం జరిగిందని తట్టుకోలేక పోయానని కన్నీరు మున్నీరు అవుతూ తెలిపారు. ఒక్కొక్క గొర్రె విలువ 8000 వేల రూపాయల నుండి 9000 ల రూపాయల వరకు ఉంటుందని పేర్కొన్నారు . మొత్తం మృతి చెందినా గొర్ల విలువ 150000 రూపాయలవరకు ఉంటుందని అన్నారు . ఈ గొర్రెలు రెచిని ఎగ్గే మల్లయ్య కు చెందినవని తెలిపారు .
No comments:
Post a Comment